Latest Navel Updates

Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Tuesday, 2 July 2013

ఈ-ఆధార్..గుర్తింపు, చిరునామా ధ్రువపత్రంగా ఉపయోగించుకోవచ్చు!

ఈ-ఆధార్..గుర్తింపు, చిరునామా ధ్రువపత్రంగా ఉపయోగించుకోవచ్చు. ‘డిజిటల్ సిగ్నేచర్ ఉండే ఎలక్ట్రానిక్ రికార్డులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 చట్టబద్ధత కల్పిస్తోంది. కాబట్టి ఈ-ఆధార్ కూడా చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పత్రమే. దానిపైనా డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది’ అని పేర్కొంది. పోస్టులో వచ్చే ఆధార్ పత్రంలో ఉన్న వివరాలే ఈ-ఆధార్‌లోనూ ఉంటాయని పేర్కొంది. పౌరులు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించింది. పోస్టులో ఇంటికొచ్చే ఆధార్ లెటర్ నుంచి కత్తిరించి విడిగా తీయడానికి వీలున్న భాగాన్ని కొందరు గుర్తింపు పత్రంగా అంగీకరించడం లేదంటూ తమకు ఫిర్యాదులు వస్తున్నాయని యూఐడీఏఐ తెలిపింది. అయితే అందులో ఫొటోతో పాటు పేరు, చిరునామా, ఆధార్ నంబర్ అన్నీ ఉంటాయని, కాబట్టి అది చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పత్రమని స్పష్టంచేసింది. 

Tags: Telugu News, Andhra News, News

తెలంగాణ ఫై అసెంబ్లీ లో తీర్మానం వీగిపోతుంది - లగడపాటి

 స్థానిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం పెడితే వీగిపోవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతతూ దీనికి సంబంధించి తీర్మానం వీగిపోయేలా ప్రయత్నిస్తామన్నారు. అందరు కలిసి తెలుగుతల్లిని బలిపిఠం ఎక్కించారని ఆయన వాపోయారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు.
 టిడిపి నేతలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నందువల్ల, ఆ పార్టీ విభజనకు అనుకూలంగా లేఖను ఇచ్చినందువల్లనే కేంద్రం తెలంగాణ వైపు మొగ్గుతుందని లగడపాటి ఆరోపించారు. కేంద్రం తెలుగు తల్లిని చీల్చుతుందా? లేక అలాగే ఉంచుతుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు.
కాంగ్రెసు పార్టీ ఎంపీలు, నేతల్లో చాలామంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజన భారాన్ని కేంద్రంపై వేసిందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
శ్రమిస్తున్నాయని  లగడపాటి చెప్పారు. ఈ సమస్య పరిష్కారంపై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ మూడేళ్లలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని గతంలోనే చెప్పామని కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం వద్దన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టినా వీగిపోవడం ఖాయమన్నారు.

Tags: Telugu News, Andhra News, News

వై యస్ అర్ CP లో చేరనున్న మోపిదేవి వేంకట రమణ !

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపీదేవి వెంకటరమణ వైపీసీ తీర్థం పుచ్చుకోనున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలియవచ్చింది. మోపిదేవి బెయిల్ కోసం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఒక వేళ బెయిల్ రాని పక్షంలో బుధవారం చంచల్‌గూడ జైల్లోనే జగన్ సమక్షంలో మోపిదేవి వైసీపీ ఖండువా వేసుకోనున్నారు.
గురువారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో మోపిదేవి భార్య, సోదరుడు, ఆయన వర్గీయులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా మోపిదేవి వెంకటరమణను అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మోపిదేవి వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

Tags: Telugu News, Andhra News, News

కాంగ్రెస్ ఫై నమ్మకం తక్కువగా ఉంది - టీడీపి

దిగ్విజయ్ సింగ్ మాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నా కాంగ్రెస్‌పై నమ్మకం తక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీకి ఒకో ఇన్‌ఛార్జి వచ్చినప్పుడల్లా ఒకో మాట మాట్లాడుతున్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు నెలలో తెలంగాణ సంగతి తేలుస్తామని షిండే అన్నారు. నెలంటే నెల కాదని తర్వాత చెప్పారు. ఇప్పుడు దిగ్విజయ్ పది రోజులు అంటున్నారు. తర్వాత ఏమంటారో తెలియదు.

పంచాయతీ ఎన్నికల కోసం ఆ పార్టీ డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇవ్వదల్చుకొంటే ఎవరు ఆపారు? అక్కడ ఒక మాట...ఇక్కడ ఒక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నారు. కెసిఆర్, కాంగ్రెస్ పార్టీ చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవడం ముఖ్యం తప్ప మిగిలినవి కాదు. పార్లమెంటులో బిల్లు పెడితే మేం మద్దతు ఇస్తాం. అసెంబ్లీలో పెట్టినా మా మద్దతు ఉంటుంది' అని ఆయన అన్నారు. దిగ్విజయ్ మాటల్లో లోతు ఉంది... తమ పార్టీ...జగన్ పార్టీ డిఎన్ఎ ఒకటేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో లోతు ఉందని మోత్కుపల్లి అన్నారు.

Tags: Telugu News, Andhra News, News

తెలంగాణా ఫై నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉండాలి - దిగ్విజయసింగ్

 ప్రత్యేక తెలంగాణ సమస్యపై నిర్ణయం ఏదైనా ఇరు ప్రాంతాల నేతలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించిన దిగ్విజయ్ సింగ్ మంగళవారం కర్నాటకలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో తమ విజయావకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తమ దృష్టి అంతా దక్షిణాది రాష్ట్రాల పైనే ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో యాభై సీట్లు గెలువాలనేది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌ల పైననే తమ దృష్టి ఉందని చెప్పారు. తమ ఆశలు కూడా దక్షిణాది పైనే ఉన్నాయన్నారు. కర్నాటక లోకసభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కేరళలోను తమకు అనుకూలంగా ఉందన్నారు. తమిళనాడులో పొత్తులకు ఇంకా సమయం ఉందని చెప్పారు. తెలంగాణ విషయంలో రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పానని, ఒకటి విభజన, రెండు సమైక్యాంధ్ర అన్నారు. రాష్ట్ర విభజన, సమైక్యంపై రోడ్‌మ్యాప్ తయారు చేసి నివేదిక ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను కోరామని తెలిపారు. ఆ నివేదికను అధిష్టానానికి ఇస్తామని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు.

Tags: Telugu News, Andhra News, News

Sunday, 30 June 2013

తెలంగాణ రాజధానిగా హైదరాబాద్: డీఎస్ !

తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి తెలంగాణ సాధన సభకు ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ నేతల ఐక్యత వల్ల ప్రజల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో తప్ప మిగతా పార్టీలతో తెలంగాణ రాదన్న నిజం ప్రజలకు తెలుసని అన్నారు. సోనియాతోనే తెలంగాణ సాధ్యమని పార్టీ కదిలిందన్నారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకే ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు. తొందరలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉంటుందన్నారు.

Tags: Telugu News, Andhra News, News

సక్సస్ తో దూసుకెళుతున్న శ్రుతి హాసన్ !

మొదట్లో అన్ని ఇండస్ట్రీల్లో పరజయాల్ని అందుకున్న శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బాగా బిజీ అయిపొయింది. తాజాగా శ్రుతి హాసన్ రవితేజ సరసన నటించిన ‘బలుపు’ సినిమా విడుదలై హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన ఈ భామ తన రాబోయే హిందీ ‘డి-డే’ సినిమాలో వేశ్య పాత్రలో శృతి మించి అందాలు ఆరబోసిందని అంటున్నారు. దానికి సంబందించిన కొన్ని ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదే విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తే ‘ వేశ్య పాత్రని ఒక సవాల్ గా తీసుకున్నా అందుకే ఆ సినిమా చేసాను. సినిమా పోస్టర్ ని చెడుగా చూస్తే చెడుగా అనిపిస్తుంది, అదే కళాత్మక దృష్టితో చూస్తే అసభ్యంగా కనపడదు. చూసే వారి దృష్టిని బట్టి అది ఉంటుంది. నేను ఈ సినిమాలో చేసింది బోల్డ్ రోల్, అది నేను కాదనను. కానీ సినిమాలో ఆపాత్రని చూస్తే కచ్చితంగా నచ్చుతుంది. నాకు తెలిసి ఇలాంటి పాత్ర ఎవరికీ వచ్చినా చేస్తారని’ శృతి సమాధానం ఇచ్చింది.

Tags: Telugu News, Andhra News, News,

జానాపై చెప్పు విసిరేందుకు ప్రయత్నించిన యువకుడు !

తెలంగాణ సాధన సభలో మంత్రి జానారెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు చెప్పు విసిరేందుకు ప్రయత్నం చేశాడు. యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ సాధన సభలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.


Tags: Telugu News, Andhra News, News

తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం : జానా రెడ్డి !

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడిన తర్వాత విచక్షణకు గురైందని, ఒప్పందాల ఉల్లంఘన జరిగిందని సంఘాలు, సంస్థలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాల్ని చేపట్టాయని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ సాధన సభ’లో జానారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులకు జోహార్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం గత 57 సంవత్సరాల నుంచి జరుగుతోంది అని జానా అన్నారు. 1956 నుంచి కొండా వెంకట రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డిలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశారన్నారు. శాసన మండలి, శాసన సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని జానా అన్నారు. 

తెలంగాణ కోసం పార్టీ అధిష్టానాన్ని ఎదరించిడానికి కూడా వెనుకాడలేదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, కుటుంబం లాంటి పార్టీతో తన సన్నిహితులు విభేధించారని జానా తెలిపారు. ప్రజల ఆకాంక్ష, నాయకుల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరలో జరుగుతుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. 

పది జిల్లాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే రోజు తొందర్లోనే ఉందని, అనేక రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని.. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటుందని జానా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుస్థిరతకు మారుపేరుగా నిలుస్తుందని, దేశంలోనే ఓ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని జానా ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకోవద్దని.. యువత నిస్పృహకు లోనుకావోద్దని.. త్వరలోనే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందనే హామీని జానా ఇచ్చారు. ఈ సభ ఏర్పాటు రాజకీయ లబ్దికోసం కాదని.. తెలంగాణ సాధన కోసమేనని జానా తెలిపారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికైనా సిద్ధం అని.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీట్లు ఎవరికిచ్చినా గెలిపిస్తాం అని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాటం కొనసాగిస్తునే ఉంటామన్నారు.

Tags: Telugu News, Andhra News, News

విశాఖ చేరుకున్న దిగ్విజయ్ సింగ్ !

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఈ సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, ఎంపీ కనుమూరి బాపిరాజు, సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి స్వాగతం పలికారు. 

Tags: Telugu News, Andhra News, News

బద్రీలో ఇంకా 3 వేల మంది బాధితులు !

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. బద్రీనాథ్‌, హార్సిలీ ప్రాంతాల్లో ఇంకా 3 వేల మంది బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలించగానే వీరిని తరలించేందుకు 17 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. మరోవైపు 3 వేల మంది అభాగ్యుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. వీళ్ళంతా ఎక్కడున్నారు. ఎలా ఉన్నారన్న దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 14వందల మంది మాత్రమే చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నా వాస్తవానికి వాళ్ళ సంఖ్య 5 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 

అటు కేదార్‌నాథ్‌లో సామూహిక అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 50కి పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పలు మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. గుర్తించిన శవాలకు అంత్యక్రియలు చేస్తున్నా... మట్టి దిబ్బల్లో మృతదేహాలు కూరుకుపోయాయి. పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తుండడంతో అంటువ్యాధులు ప్రబలకుండా చూసేందుకు సైనిక సిబ్బంది రసాయనాలు చల్లుతున్నారు. రహదారుల పునరుద్ధరణ ప్రక్రియ కూడా ఊపందుకుంది. జోషిమఠ్-బద్రీనాథ్, రుద్రప్రయాగ-గౌరీకుండ్, ఉత్తరకాశీ-గంగోత్రి మార్గాలు మినహా మిగతా రోడ్లను తెరిచారు.

కేదారినాథ్ పూజలపై వివాదం !

జలప్రళయానికి చిధ్రమైన కేదారినాథ్ లో మరో వివాదం మొదలైంది. ఆలయంలో పూజల పునరుద్ధరణపై  పూజారులు, సాధువుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వరద విలయానికి మహా శ్మశనవాటికలా మారిన ఆలయాన్ని పూర్తిగా శుద్ది చేయకుండా పూజలు ప్రారంభించబోమని పూజారులు చెబుతున్నారు. అయితే సాధువులు మాత్రం పూజారుల వాదనను కొట్టిపారేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రపరిచిన వెంటనే పూజలు చేస్తామని పట్టుబడుతున్నారు. దీంతో కేదారినాథ్ లో పూజా వివాదం ముదురుతోంది.

సాధువుల వాదనను శంకరాచార్య స్వరూపానంద సమర్ధించడాన్ని ప్రధాన పూజారులు వ్యతిరేకిస్తున్నారు. కేదారినాథ్ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధిచేయకుండా పూజలు ప్రారంభిస్తే తాము కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ప్రధానిని కలిసి అడ్డుకోవాలని కోరతామంటున్నారు. మరోవైపు ప్రధాన పూజారి పాలకవర్గ కమిటీకి సేవకుడిలా మారారని సాధువులు,పీఠాధిపతులు మండిపడుతున్నారు. 

Tags: Telugu News, Andhra News, News

కాంగ్రెస్, టీడీపీలపై విరుచుకుపడ్డ షర్మిల !

విశాఖ జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థానం నాన్ స్టాప్ గా సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ..ముందుకు పోతున్న షర్మిల..కాంగ్రెస్, టీడీపీలపై విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రతిపక్షాలు విఫలమయ్యాయని షర్మిల విమర్శించారు. 

విశాఖ జిల్లాలో షర్మిల  మరో ప్రజాప్రస్థానం జోరుగా సాగుతోంది. శనివారం రావికమతం మండలం లులూరు నుంచి  ప్రారంభమైన యాత్ర..చోడవరం వరకు సాగింది. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు షర్మిల. చోడవరంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. సర్కార్ అసమర్దత రైతులు, పేదలు కష్టాల పాలయ్యారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పాలక, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు. 

షర్మిల పాదయాత్రకు విశాఖ జిల్లా వాసులు దారిపొడవునా స్వాగతం పలికారు. రాత్రి చోడవరంలో బస చేసిన షర్మిల..ఇవాళ అక్కడి నుంచే యాత్రను కంటిన్యూ చేయనున్నారు. 

Tags: Telugu News, News, Andhra News

తుక్కుకింద చారిత్రక రాజమండ్రి బ్రిడ్జి రైల్వే శాఖ నిర్ణయం !

113 ఏళ్ల క్రితం గోదావరిపై మొట్టమొదటగా రాజమండ్రి వద్ద నిర్మించిన హేవలాక్ బ్రిడ్జిని రైల్వే శాఖ తుక్కుకింద అమ్మి సొమ్ము చేసుకోవడానికి రెడీ అయింది. వందేళ్ల పాటు సేవలందించిన..  ఈ బ్రిడ్జి సర్వీసు పూర్తికావడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. అప్పటినుంచి తుక్కఖాతాలో చేర్చేందుకు రైల్వే బోర్డు  ప్రయత్నిస్తూనే ఉంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రైల్వే బోర్డు బ్రిడ్జి అంశాన్ని తెరమీదికి తెచ్చింది. నష్టాలను పూడ్చుకునేందుకు హేవలాక్‌ బ్రిడ్జిని 67 కోట్ల రూపాయలకు వేలం పెట్టింది. 

ఈ వార్త విన్న రాజమండ్రివాసులు అవాక్కయ్యారు. తేరుకుని  పురాతన కట్టడంగా బ్రిడ్జిని కాపాడుకునేందుకు ఉద్యమబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయలు ఇస్తామంటోంది. ప్రభుత్వ వైఖరి హాస్యాస్పదంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జిని కూల్చకుండా  చర్యలు తీసుకుని.. రాజమండ్రి వాసులకు కానుగా ఇవ్వాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.గతంలో 5 కోట్లుకు తుక్కు ఖాతాలో చేర్చుతామన్న రైల్వే శాఖ ..ఉన్నట్లుండి 67 కోట్లకు బేరం పెట్టింది..అయితే ..బ్రిడ్జిని చారిత్రక కట్టడంగా భావించి..వేలం నిర్వహించ వద్దని రైల్వే శాఖను కోరుతున్నారు.

Taga: Telugu News, News, Andhra News

తెలంగాణ వస్తుంది — జానారెడ్డి !

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కి తెలంగాణ పట్ల చిత్త శుద్ధి లేదని తెరాస నేతలు పలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలకు తెర దించడం కోసం టి కాంగ్రెస్ నేతలంతా ఒకటై భారీ ఎత్తున నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో తెలంగాణ సాధన సభని ఏర్పాటు చేసారు. ఈ సభకి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సభలో మంత్రి జానా రెడ్డి ఎంతో ఆవేశంగా ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ఏర్పడి తీరుతుందని అన్నారు.
జానా రెడ్డి మాట్లాడుతూ ‘ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంది. తెలంగాణా ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని, అనేక రాష్ట్రాలు మూకుమ్మడిగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణాను ఏర్పాటు చేస్తుందని’ ఆయన ధీమా వ్యక్తం చేసారు. ‘త్వరలోనే సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణా వస్తుంది. ఒకవేళ అలా రాకుంటే ప్రజల పక్షాన నిలబడి నిర్ణయం తీసుకుంటామని’ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెలిపారు.

Tags: News, Telugu News, Andhra News


ఉత్తరాఖండ్ వరదల్లో మృతుల సంఖ్య పదివేలకు పైనే !


ఉత్తరాఖండ్ వరదల్లో మృత్యువాత పడినవారెంత మంది..? ప్రభుత్వం చెబుతున్నట్లు వారి సంఖ్య వెయ్యి లోపే ఉందా..? లేదా అంచనాలకందని స్థాయిలో మరణాలు సంభవించాయా..? దేశంలో ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్నలివీ! ఓవైపు వరదల్లో చనిపోయినవారు వెయ్యి కన్నా తక్కువే ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వాల్ మాత్రం మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని స్పష్టంచేశారు. ‘‘అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 822గా ఉంది. నేను ఇంతకుముందు గర్వాల్ ప్రాంతంలో పర్యటించినప్పుడు 4 వేల నుంచి 5 వేల మంది వరకు చనిపోవచ్చని అనుకున్నా. 

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఆ విలయాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నదాన్ని బట్టి వారి సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అనిపిస్తోంది..’’ అని కుంజ్వాల్ పేర్కొన్నారు. మట్టిదిబ్బలు, బురదలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కూరుకుపోయి ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం ఆయన అల్మోరాలో విలేకరులతో మాట్లాడారు. మరోవైపు శుక్రవారం రాత్రి వరకున్న సమాచారం మేరకు మృతుల సంఖ్య 900గా ఉందని, ఇప్పటిదాకా 1.05 లక్షల మందిని కాపాడినట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ముంబైలో చెప్పారు. మట్టి దిబ్బలు, కొండ చరియల తొలగింపు తర్వాతే ఎందరు మరణించారన్న అంశంపై ఓ అంచనాకు రాగలమని, ప్రస్తుతానికైతే వెయ్యి దాకా చనిపోయి ఉండవచ్చని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) లెక్క మరోలా ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు మృతుల సంఖ్య 580 మాత్రమేనని తెలిపింది. ఇక ఆచూకీ లేని వారి సంఖ్య అధికారికంగానే 3 వేల దాకా ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సుభాష్ కుమార్ తెలిపారు.

చెట్లకు వేలాడుతున్న శవాలు..: కేదార్‌నాథ్‌లో ఎంత భయానకంగా మారిందో అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి వస్తున్నవారి మాటలను చూస్తే తెలుస్తోంది. కేదార్‌నాథ్ మార్గంలో రాంబడ, గౌరీకుండ్, జంగల్‌చెట్టీ లాంటి గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందినవారు కేదార్‌నాథ్‌లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటారు. వరదల్లో కుటుంబీకులు, తమ బంధువులు తప్పిపోవడంతో వీరంతా కేదార్‌నాథ్ వెళ్లి వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 

వీరితోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు కూడా అక్కడికి వెళ్లి ఆత్రంగా బంధుమిత్రుల కోసం వెతుకుతున్నారు. వీరిలో నిరాశతో వెనుదిరుగుతున్న కొందరు కేదార్‌నాథ్‌లో ప్రత్యక్షంగా చూసిన భయానక అనుభవాలను వివరిస్తున్నారు. ‘‘అక్కడికి వెళ్తే తప్పిపోయిన మీవారి గురించి విలపించరు. ఆ విలయాన్ని చూసి ఏడుస్తారు. ఎక్కడికక్కడ మృతదేహాలు పడి ఉన్నాయి. కొన్ని చెట్లకు వేలాడుతున్నాయి. మరికొన్ని బండల మధ్య ఇరుక్కుపోయాయి. ఇంకొన్ని నదీ తీరం వెంట పడి ఉన్నాయి. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. వాటి నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది’’ అని శ్యామల్ శర్మ అనే వ్యక్తి చెప్పారు. రాంబాడలో ఈయన బంధువుల కుటుంబం వరదలో కొట్టుకుపోయింది.

స్థానికులు, వలస వచ్చిన వారి వివరాలేవీ?
కేదార్‌నాథ్ చుట్టుపక్కల గ్రామాల్లోని అనేక మంది స్థానికుల వివరాలు కూడా ఇంకా లభ్యంకావడం లేదు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులకు వివిధ వస్తువులు విక్రయించేవారు, వారిని వేర్వేరు ప్రాంతాలకు తరలించేవారు అనేకమంది జీవనోపాధి కోసం ఇక్కడకు తరలివస్తుంటారు. నేపాల్, యూపీలోని వారణాసి నుంచి చార్‌ధామ్ యాత్ర సాగే సీజన్‌లో వందలమంది ఇక్కడకు వస్తారు. రుద్రాక్షలు, దేవుని ప్రతిమలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గుర్రాల ద్వారా యాత్రికులను తీసుకువెళ్లే 4,500 మంది ఇక్కడ బతుకుతుంటారు. నేపాల్ నుంచి దాదాపు 2 వేలమంది వచ్చి డోలీల్లో యాత్రికులను మోస్తారు. వీరిలెక్కలు ఎక్కడా లేవు. స్థానికంగా కూలీ పనులు చేసే పహాడీల జాడ కూడా కనిపించడంలేదు. సైనికులు చూసిన శవాలు, విపత్తు తీవ్రత, రక్షణ కోసం ఎదురుచూసినవారు అందించిన వివరాలను పరిశీలిస్తే మృతుల సంఖ్య 10 వేల కంటే ఎక్కువే అనడం అతిశయోక్తి కాదు.

వందల కిలోమీటర్ల మేర శవాలే..: వరదల్లో కొట్టుకుపోయిన చాలామంది తర్వాత శవాలై కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో తేలారు. హరిద్వార్ వద్దే దాదాపు 50కి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మరికొన్ని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, ముజఫర్ నగర్‌లో తేలాయి. ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్‌లోని గంగాతీరం వెంట 27 మృతదేహాలు వెలికితీశారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కల్లో ఉన్నాయా లేదా అన్నది తెలియడం లేదు.

సహాయక చర్యలకు మళ్లీ అంతరాయం..
ఆగుతూ కురుస్తున్న వర్షాల వల్ల శనివారం కూడా సహాయక చర్యలకు విఘాతం కలిగింది. వాతావరణం అనుకూలించిన సమయంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో సహాయక చర్యలు కొనసాగాయి. మరోవైపు కేదార్‌నాథ్‌లో ఇప్పటిదాకా 34 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తికాగా, మట్టిదిబ్బల నుంచి మరో 12 శవాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడికక్కడ తెగిపడిన అవయవాలు, రోజులు గడిచే కొద్దీ కుళ్లిపోతున్న మృతదేహాల వల్ల కేదార్‌నాథ్ పరిసరాలు దుర్వాసన వెద జల్లుతున్నాయి. దీంతో అంటువ్యాధులు ప్రబలకుండా చూసేందుకు సహాయక సిబ్బంది రసాయనాలు చల్లుతున్నారు.

శనివారం బద్రీనాథ్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 1,313 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 600 మందిని హెలికాప్టర్ల ద్వారా, మిగతావారిని కాలినడకన తరలించినట్లు సీఎస్ సుభాష్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా 500 మందిని కాపాడాల్సి ఉందని వివరించారు. రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాల్లో వరదలకు సర్వం కోల్పోయిన సుమారు 600 గ్రామాలకు తిండిగింజలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆ గ్రామాలకు 2,379 టన్నుల గోధుమలు, 2,875 టన్నుల బియ్యాన్ని పంపినట్లు వివరించారు. తెహ్రీ జిల్లాలో 139, ఉత్తరకాశీలో 132, చమోలీలో 110, రుద్రప్రయాగలో 71 రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కొద్దినెలల కిందటే 4 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైన కలిగంగ-1 ప్రాజెక్టు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిందని, రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రజా పనుల విభాగం, జల విద్యుత్ విభాగాల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.800 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తేలింది. ప్రభుత్వ శాఖలు ఇంకా నష్టం అంచనాను లెక్కగట్టే పనిలో ఉన్నాయి.

Tags: News, Telugu News, Andhra News

అమర్‌నాథ్ యాత్రకు పెరిగిన రద్దీ !

అమర్‌నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ వెళ్లే యాత్రికులకు తక్షణం అనుమతి ఇస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది.

Tags: News, Telugu News, Andhra News

రాష్ట్రం విడిపోయే ప్రసక్తేలేదు : శైలజానాథ్ !

 రాష్ట్రం సమైక్యంగానే వుంటుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానా«థ్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2009 డిసెంబర్ 23న పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో అదే నెల తొమ్మిదో తేదీన కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ప్రాధాన్యం లేనట్టేనని అన్నారు.

అయితే తాజాగా వస్తున్న ఉహాగానాలకు తెరదించాలని, రాష్ట్రాన్ని చీల్చేది లేదని స్పష్టం చేయాలని అధిష్ఠానాన్ని కోరతామన్నారు. విశాఖ రానున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయసింగ్‌ను కలిసి మాట్లాడతామన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు యూ టర్న్‌పై స్పందిస్తూ... కేంద్ర మంత్రిగా ఆయన మాట్లాడి వుంటారని, ఆయన మాటలనుబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags: News, Telugu News, Andhra News

Saturday, 29 June 2013

తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న మోహన్ బాబు !

నటుడు మోహన్ బాబు తన నూతన సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుండగా పడవ ప్రమాదంలో నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కు రిహార్సల్ చేస్తున్నాడు. జెట్ స్కై ను మొదటిసారి నడపినప్పుడే ఈ సంఘటన చోటుచేసుకుంది.
మోహన్ బాబును సినిమా బృందం రక్షించారు. ఆయన, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనివల్ల షూటింగ్ కాసేపు ఆగిపోయింది. వీరిద్దరూ క్షేమంగా చేరుకునేసరికి దర్శకుడు ఊపిరిపీల్చుకున్నాడు.

మంచు వంశం అంత కలిసినటిస్తున్న ఈ మెగా ఎంటర్టైనర్ కోసం మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఈరోజు ఉదయం జెట్ స్కయింగ్ చేసారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మరియు లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం నలుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.

Tags: News, Telugu News, Andhra News

రాష్ట్రాన్ని విడగోట్టలనుకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం !

తెలంగాణా పై సానుకూల ప్రకటన వెలువడనుందనే ఉహాగానాలు వినిపిస్తుండడంతో సమైక్యాంద్ర విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ప్రతినిధులు నిన్న ఆంద్ర విశ్వవిద్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేదంటే రాష్ట్రంలో అగ్ని గుండాన్ని సృష్టిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన 12 విశ్వ విద్యాలయాలకు చెందిన ఐకాస ప్రతినిధులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి మనోభావలకు వ్యతిరేకంగా తెలంగాణా ఇవ్వాలనుకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అన్నారు. అలాగే రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతామని స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. ఈ నెల 30న రాష్ట్రాన్ని సమక్యంగానే ఉంచాలని కోరుతూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలువనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమావేశంలో నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంద్ర విశ్వవిద్యాలయంతో పాటు మరి కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్ధి ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: News, Telugu News, Andhra News