Latest Navel Updates

Thursday, 27 June 2013

ఉత్తరాఖండ్ వరదల్లో ఆచూకీ లభించని 278 రాష్ట్రవాసులు!

హైదరాబాద్, జూన్ 27 : ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతై ఆచూకీ లభించిన రాష్ట్ర వాసులు ఇంకా 278 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ 153, రంగారెడ్డి 68, కరీంనగర్ 19, విశాఖ 10, కడప 10, చిత్తూరు 10, గుంటూరు 6, ప.గో 3, అనంతపురం 3, నిజామాబాద్ ఇద్దరు యాత్రికుల ఆచూకి లభ్యం కాలేదు. దీంతో గల్లంతైన వారి ఫోటోలు ఉత్తరాఖండ్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గల్లంతైన వారి ఫోటోలను బంధువులు, ట్రావెల్ ఏజెంట్లు ఆయా జిల్లా కలెక్టరేట్లకు అందజేయాలని విపత్తు నివారణ అధికారి రాధ కోరారు.

Tags: News, Telugu News, Andhra News

No comments:

Post a Comment